కడప 15వ డివిజన్ పరిధిలోని పుట్లంపల్లి చెరువు కట్ట వద్ద రూ. 1.35 కోట్లతో 2.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి సోమవారం భూమిపూజ నిర్వహించారు. నాణ్యమైన రోడ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వారు తెలిపారు.