E.G: ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలో 135వ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ ఎం.రామకృష్ణ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని వారు కొనియాడారు.