E.G: లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. పాల కావడి ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పురవీధుల్లో కావడితో ఊరేగింపు నిర్వహించి, అనంతరం స్వామివారికి లక్ష బిల్వార్చన, నక్షత్ర హారతి ఇచ్చారు. సాయంత్రం హోమాలు, పూర్ణాహుతితో వేడుకలు ముగిశాయి.