SKLM: వజ్రపు కొత్తూరు మండలం గోవిందపురంలోనిప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు చేరాలని ప్రిన్సిపల్ బడా వెంకట్ మోహన్ విద్యార్థులకు అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులతో అడ్మిషన్ డ్రైవ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యతోపాటుగా క్రమశిక్షణ ఉంటుందన్నారు.