KRNL: అనంతపురం హనీట్రాప్ ముఠాకు అనుకూలంగా వ్యవహరించారని గురువారం ఇద్దరు సీఐలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సీఐలు రాజేంద్రనాథ్, శ్రీహర్షను కర్నూలు వీఆర్కు పంపుతూ.. ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ వద్ద రిపోర్టు చేయాలని ఇద్దరు సీఐలకు ఆదేశించారు. హనీట్రాప్ ముఠాతో సంబంధాలున్న మరో 10 మందిని ఎస్పీ అశ్విన్ విచారిస్తున్నారు.