ATP: కనేకల్లు మండల కేంద్రంలో స్వచ్ఛ రథాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శనివారం ప్రారంభిoచారు. పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల సరైన నిర్వహణ, ఆరోగ్యకరమైన జీవనశైలికి ఈ స్వచ్ఛ రథం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజల సహకారంతో కనేకల్లు మండలాన్ని మరింత శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దుకుందాం అని ఆయన కోరారు.