అన్నమయ్య: మదనపల్లెలోని మణప్పురం ఫైనాన్స్ రిథి జువెలరీస్ తమను మోసం చేసిందని బాధితులు జిల్లా ఎస్పీ ధీరజ్కు సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 170 మంది తమ సమస్యలను తెలియజేశారు. వీరిలో కొందరు జువెలరీలో జరిగిన మోసంపై ఫిర్యాదు చేయగా, ఎస్పీ విచారణకు ఆదేశించారు.