గుంటూరులో ఏపీ టీఎంసీ కాటన్ కాన్సారియం జిన్నింగ్ & ప్రెస్సింగ్ ఫ్యాక్టరీస్ జనరల్ బాడీ ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎల్చూరి వెంకటేశ్వర్లు ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఉప్పుటూరి సాంబశివరావు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా, ఇతర పదవుల్లో పలువురు నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.