తూ.గో: తాళ్లపూడి మండలం తాడిపూడి రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షుడు నామా వెంకట సుబ్బారావు శుక్రవారం ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు 24 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రుచిత పాల్గొన్నారు.