ASR: కూటమి ప్రభుత్వంలో ఆదివాసీలకు తీరని అన్యాయం జరిగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్స ఆరోపించారు. శనివారం అరకులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిన్న పాడేరు పర్యటనకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గిరిజన వికాసంపై ప్రకటన ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల హామీల అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.