SKLM: శ్రీకాకుళంలోని డయేరియా కేసులు 76కి చేరడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. బాధితుల కోసం రిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పించారు. ప్రభావిత కాలనీల్లో 50 సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాయి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. తాగునీరు మరిగించి తాగాలని వైద్యులు సూచించారు.