సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని కోటకు చెందిన వైసీపీ కార్యకర్త మహేష్ తండ్రి ఎం.నారాయణ స్వామి మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.