BPT: కారంచెడు మండలంలోని పశువైద్యశాల భవనం పూర్తిగా పాడై ప్రమాదకరంగా మారింది. గోడలు చెదిరిపోవడం, పైకప్పు దెబ్బతినడం వల్ల సిబ్బంది, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత భవనాన్ని తొలగించి, అదే స్థలంలో నూతన భవనం నిర్మించేందుకు ఆమోదం తెలిపినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.