CTR: తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని అంగన్వాడి కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం పుంగనూరులోని ICDS ప్రాజెక్టు కార్యాలయం వద్ద బైఠాయించి తమ నీరస తెలిపారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, పని గంటలు తగ్గించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.