కోనసీమ: కె.గంగవరం మండలం కోట గ్రామం ఏటి గట్టుపై ఉన్న సూయిజ్ వంతెన శిథిలావస్థకు చేరిందని స్థానికులు అంటున్నారు. గతంలో ప్రమాదాలు నివారణకు యువత ఇక్కడ ఇనుప మెస్ ఏర్పాటు చేసిన వాహనాలు ధాటికి అది దెబ్బతిని పరిస్థితి మళ్లీ మొదటి వచ్చిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి వంతెనకు పూర్తిస్థాయి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.