ELR: కొయ్యలగూడెం(మం) దిప్పకాయలపాడు గ్రామంలో మంగళవారం ‘రైతన్నా మీకోసం’ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఏపీ ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామస్థాయిలో రైతులకు అండగా నిలవడమే ఈ వారోత్సవాల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైతులకు అందుతున్న పథకాలు, క్షేత్రస్థాయి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.