BPT: చీరాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ముక్కోణం పార్క్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రముఖ నాయకులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ నీలం శామ్యూల్ మోజెస్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.