ATP: ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి మూడు తామ్ర శాసనాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. క్రీ.శ. 1527లో తెలుగు, సంస్కృత భాషల్లో వీటిని రాయించినట్లు చరిత్రకారుడు బుక్కపట్నం గోపి తెలిపారు. వీటిని పూర్తిస్థాయి విశ్లేషణ కోసం మైసూరులోని పురావస్తు శాఖ కార్యాలయానికి పంపించామని ఆయన వివరించారు.