SKLM: శ్రామిక మహిళల ఉపాధి పై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు ఉద్యమించాలని పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ అన్నారు. మంగళవారం పలాస మండలం మామిడిపల్లిలోని మార్చి 8న జరిగే సభలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మార్చి 1 నుంచి 8 వరకు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు.