KKD: మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని, ఇలాంటి వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని కాకినాడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగ దుర్గా రావు హెచ్చరించారు. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు వన్ టౌన్ పరిధిలో రోడ్డు యాక్సిడెంట్లను తగ్గించాలని సోమవారం డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించి నలుగురును అరెస్ట్ చేసినట్లు తెలిపారు.