బాపట్ల: తెనాలికి చెందిన శిరీష బండ్ల ఏరోనాటికల్ ఇంజనీర్గా ఎదిగి వర్జిన్ గెలాక్టిక్ ద్వారా 2021లో అంతరిక్షంలోకి వెళ్లి గుర్తింపు పొందారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసిలోకి వెళ్లిన మూడో భారత సంతతి మహిళగా నిలిచారు. ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.