కోనసీమ: మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరిందని జేఏసీ ఛైర్మన్ కామన ప్రభాకర్ రావు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జేఏసీ పోరాటం ఫలించిందన్నారు. ఈ క్రమంలో సోమవారం జేఏసీని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరిలోకి మండపేట చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.