VZM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు కేంద్ర ఆమోదం లభించడంతో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ఇవాళ నియోజకవర్గ యువతతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన రోజుగా లిఖింపబడిందన్నారు. ఈ సందర్బంగా తెలుగువారికి గౌరవాన్ని అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.