KKD: యూ. కొత్తపల్లి మండలం గోర్స సీతారామస్వామి ఆలయ భూముల వివాదం సోమవారం ముగిసింది. కొమరగిరిలోని 19.95 ఎకరాల భూములపై నెలకొన్న సుదీర్ఘ వివాదంపై స్పందించిన దేవాదాయశాఖ బహిరంగ వేలం నిర్వహించింది. ఈ వేలం ద్వారా రూ. 10 లక్షలకు పైగా ఆదాయం లభించింది. ఈ కార్యక్రమంలో ఈవో ధనలక్ష్మి, ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.