KDP: ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఇవాళ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో జరుగుతున్న అబివృద్ధి పనుల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈనెలలో మూడు సార్లు ఆసుపత్రిని ఎమ్మెల్యే సందర్శించారు. కంటి విభాగం, వాష్ రూముల నిర్మాణాలను పరిశీలించారు. ఎస్ఈ లక్ష్మీపతి రెడ్డికి ఫోన్ చేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.