కోనసీమ: చట్టసభల్లో టీడీపీ తరపున 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని మంత్రి లోకేష్ మహానాడులో ప్రకటించడం హర్షణీయమని చింతలూరుకి చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు దండంగి మమత పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం టీడీపీ ఎప్పుడూ కృషి చేస్తోందన్నారు. మహిళలకు ఆస్తి హక్కులు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వంటి పథకాలు టీడీపీ తీసుకొచ్చిందన్నారు.