KRNL: ఆదోని మండల పరిధిలో జరగాల్సిన ఒక బాల్య వివాహాన్ని శక్తి బృందం అడ్డుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ, శిశు సంక్షేమ, పోలీసు, సచివాలయ సిబ్బంది కలిసి విచారణ చేపట్టారు. ఇరు కుటుంబాల సభ్యులను పెద్దతుంబలం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఇవాళ ఎస్ఐ విద్యాశ్రీ, సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాల అనర్థాలను వివరించి, చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.