ELR: జంగారెడ్డిగూడెం(m)గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సందర్భంగా పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది.ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు వివిధ సేవల ద్వారా రూ. 2,33,958 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో చందన తెలిపారు. సుమారు 4,200 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసామన్నారు.