WG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో రాజకీయ కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర నేత మాధవ్ ఆరోపించారు. శనివారం భీమవరంలో ఆయన మాట్లాడుతూ.. మరో రాష్ట్రంలో డిప్యూటీ సీఎం చిత్రపటాన్ని చెప్పులతో కొట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. ఫ్లెక్సీల వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించుకోవాలని మాధవ్ సూచించారు.