ATP: రాయదుర్గంలో తాగునీటి సరఫరా ఇబ్బందులపై మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సమీక్ష నిర్వహించారు. వారం రోజులకు కూడా నీరు అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమన్వయ లోపం వల్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. సోమవారం నుంచి నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.