KRNL: ఓటర్ల జాబితా పునఃపరిశీలన (SIR) ప్రక్రియలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఇవాళ ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేయాలని పిలుపునిచ్చారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులపై నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు.