TPT: సూళ్లూరుపేట మండలం పేర్నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు.