NDL: చాగలమర్రి మండల కేంద్రంలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కేరళ హాస్పిటల్ ఎదురుగా నిలిపి ఉన్న ఓ ఆటోపై అకస్మాత్తుగా విద్యుత్ స్తంభం విరిగి పడింది. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్తంభం పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి విరిగిన స్తంభాన్ని తొలగించాలన్నారు.