మార్కాపురం: పామూరు మండలం ఇరువురు జంక్షన్ వద్ద శనివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలు కావడంతో వారిని 108 అంబులెన్స్లో పామూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అందరూ గుమ్మలంపాడు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. వీళ్ళందరూ ఓ దేవాలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.