GNTR: మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతంలో సాగుతున్న ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పనులను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి శనివారం పరిశీలించారు. MTMC కమిషనర్ ఆలీమ్ బాషా ఆధ్వర్యంలో జేసీబీలతో ఈ పూడికతీత పనులు జరుగుతున్నాయి. వర్షాకాలం లోపు డ్రైనేజీల్లో మట్టిని తొలగించి, మురుగునీరు సాఫీగా సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు.