GNTR: ఉండవల్లి గుహల మలుపు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బస్సుల డ్రైవర్లు గాయపడ్డారు. ప్రమాద సమయంలో కాలేజీ బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.