ప్రకాశం: కొండపిసామాజిక ఆరోగ్యకేంద్రంలో జరుగుతున్న మరమ్మతు పనులను బుధవారం మంత్రి స్వామి పరిశీలించారు. వైద్యశాలను ప్రత్యేక శ్రద్ధతో పలు రకాల అభివృద్ధితో పాటు వసతులు కల్పించేందుకు మంత్రి కృషి చేస్తున్నారు. కొండపిలో వైద్యశాలకు ఇప్పటికే డయాలసిస్ యూనిట్ మంజూరు చేయించారు. మరమ్మతు పనులు వేగవంతం చేయాలని, పనులలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.