KKD: ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ MLA వరుపుల సత్యప్రభరాజా గురువారం అమరావతిలో CM నారా చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై CM సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యే.. పలువురు మంత్రులు, అధికారులను కలిసి నియోజకవర్గంలో పనులను వేగవంతం చేయాలని కోరారు.