PLD: కారంపూడి మండల కేంద్రంలోని ఎన్ఎస్పీ కాలనీలో జల్ జీవన్ మిషన్ నిధులతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ఓవర్హెడ్ ట్యాంక్కు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనంతరం RWS అధికారులతో సమీక్ష నిర్వహించారు.