ATP: తాడిపత్రి సమీపంలోని వజ్రగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా జూటూరు నుంచి దేవాలయం వరకు రూ.2.50 కోట్లతో తార్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాడిపత్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఈ పనులపై ప్రత్యేక చొరవ తీసుకున్నారు.