KRNL: జిల్లాలో 43 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతున్న తీవ్ర ఎండల మధ్య పాఠశాలలు నిర్వహించడం విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదకరమని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మహేంద్ర బాబు అన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు గోవర్ధన్, పుల్లయ్య, దశరథ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.