KDP: పులివెందుల పట్టణంలోని పార్నపల్లె రింగ్ రోడ్డు నుంచి రంగనాథస్వామి రింగ్ రోడ్డు, శిల్పారామం వెళ్లే రోడ్డుకు ఇరువైపులా విస్తరించిన వృక్షాలు ఒక పచ్చని తోరణాలతో ఏర్పడి వాహనదారులకు చల్లని నీడను ఇస్తున్నాయి. మండు వేసవిలో పచ్చని ఆకులతో చిగురించి పచ్చదనాన్ని పంచుతున్నాయి. మహిళలు, పురుషులు వాకింగ్ చేస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు.