KRNL: జనగణన ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి స్వీయ గణన పద్ధతిలో ఇవాళ కర్నూలులో తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. ప్రజలందరూ జనగణనలో తప్పనిసరిగా పాల్గొని, తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆమె సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి సరైన గణాంకాలు లభించి అభివృద్ధి కార్యక్రమాల అమలు సులభమవుతుందని స్పష్టం చేశారు.