SKLM: నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడుని జిల్లా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల నూతన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులు సమాజానికి మార్గదర్శకులని మంత్రి అన్నారు.