ATP: రాయదుర్గం పట్టణం కోటలో స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20వ తేదీ సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా పది రోజుల పాటు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ ఆధ్వర్యంలో మూడవ రోజు త్రిపుర సుందరీ దేవి హోమాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన హోమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు.