AKP: చిత్తూరులో ఈనెల 16 నుంచి 18 వరకు జరిగే రాష్ట్రస్థాయి మహిళల హాకీ టోర్నమెంట్కు జిల్లా నుంచి 18 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే నరేష్ తెలిపారు. ఎంపిక పోటీలు ఆదివారం సాయంత్రం ఎలమంచిలి హాకీ గ్రౌండ్లో నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో 25 మంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు.