PPM: ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతర 5వ వారం మంగళవారం జరగనుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో B.శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలియజేశారు. పటిష్ఠమైన క్యూలైన్లు, బారీకేడ్లు, శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనంతో పాటు ఉచిత దర్శనం, తాగు నీరు ఏర్పాటు చేశారని చెప్పారు.