ELR: జంగారెడ్డిగూడెంకు చెందిన నాగసూరి మాధురికి నటసార్వభౌమ, మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతి పురస్కారం లభించింది. ఏలూరులో టీడీపీ, జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. ఇన్నర్ వీలు క్లబ్ ఆఫ్ JRG గోల్డ్ పూర్వ అధ్యక్షురాలుగా ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ పురస్కారానికి ఎంపిక చేశారు.