ATP: రాయదుర్గం పట్టణంలోని మోడల్ స్కూల్ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 12వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మీడియాతో తెలిపారు. ఆరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 9 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.