VSP: నగరంలో పెండింగ్లో ఉన్న ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రధాన ఇంజనీరు పి.వి.సత్యనారాయణ రాజు, తదితర అధికారులతో పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.